25 నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు విద్యార్ధుల మార్పునకు ఛాన్స్

- July 19, 2021 , by Maagulf
25 నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు విద్యార్ధుల మార్పునకు ఛాన్స్

బహ్రెయిన్: ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటూ పబ్లిక్ స్కూల్స్ కి మారాలనుకుంటున్న విద్యార్ధులకు ఈ నెల 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని బహ్రెయిన్ వెల్లడించింది. స్కూల్ బదిలీ సేవలను తమ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 25 నుంచి ఆగస్ట్ 12 వరకు ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ కు గడువు ఉంటుందని పేర్కొంది. దరఖాస్తుదారులు వెబ్ సైట్లో సూచించిన సర్టిఫికెట్లను అప్లికేషన్ తో జతపరచాల్సి ఉంటుంది. అయితే..పబ్లిక్ స్కూల్స్ లో ఆయా తరగతుల్లో విద్యార్ధుల ఖాళీలను బట్టి దరఖాస్తుదారులకు అవకాశం కల్పిస్తారు. ఒకవేళ క్లాస్ లో ఫుల్ స్టెన్త్ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com