సంక్షోభం సాకుతో ధరలను కృత్రిమంగా పెంచొద్దన్న సీపీఏ

- July 19, 2021 , by Maagulf
సంక్షోభం సాకుతో ధరలను కృత్రిమంగా పెంచొద్దన్న సీపీఏ

ఒమన్: ఓ వైపు కోవిడ్ సంక్షోభ పరిస్థితులు..మరోవైపు ఈద్ అల్ అధా పండగ రోజులు. ఈ పరిస్థితులను అడ్డం పెట్టుకొని వస్తువులు, పలు సేవల ధరలను పెంచొద్దంటూ ఉత్పత్తిదారులు, సర్వీస్ ప్రొవైడర్లకు వినియోగదారుల భద్రత అధికార విభాగం-సీపీఏ హెచ్చరించింది. పండగ వేళ సాధారణంగానే షాపింగ్ కల్చర్ కనిపిస్తుంటుంది. దీంతో పలు వస్తువులకు, సేవలకు డిమాండ్ కూడా ఉంటుంది. అయితే..కోవిడ్ సంక్షోభాన్ని, పండగ డిమాండ్ ను అడ్డంపెట్టుకొని ధరలను కృత్రిమంగా పెంచొద్దని వార్నింగ్ ఇస్తూనే సర్వీస్ ప్రొవైడర్లు, సప్లయిర్లు ఇందుకు సహకరించాలని కోరింది. సుల్తానేట్లోని కొన్ని గవర్నరేట్ పరిధిలోని విలాయత్ లలో ధరలను కృత్రిమంగా పెంచటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com