నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు
- March 10, 2016
నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్లో లక్ష కెమెరాలు ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే నగరంలో 15వేల సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు చెప్పారు.గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలతో పోల్చితే ఈ ఏడాది రెండు నెలల్లో 30 శాతం మేర నేరాలు తగ్గాయన్న ఆయన సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటుచేయడమే దానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి కూడలి వరకు ఏర్పాటుచేసిన 38 సీసీ కెమెరాలను, కమాండ్ కంట్రోల్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







