నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు
- March 10, 2016
నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్లో లక్ష కెమెరాలు ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే నగరంలో 15వేల సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు చెప్పారు.గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలతో పోల్చితే ఈ ఏడాది రెండు నెలల్లో 30 శాతం మేర నేరాలు తగ్గాయన్న ఆయన సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటుచేయడమే దానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి కూడలి వరకు ఏర్పాటుచేసిన 38 సీసీ కెమెరాలను, కమాండ్ కంట్రోల్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







