రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు
- July 21, 2021
న్యూఢిల్లీ: నేడు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటామని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్ జరుపుకోవాలని సూచించారు.
‘ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది.ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఈ పర్వదినం భక్తికి, విశ్వాసానికి సంకేతమని మోడీ అన్నారు. ఈ పండుగ సోదరభావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







