‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ పథకం ప్రారంభించిన సీఎం జగన్

- July 22, 2021 , by Maagulf
‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ పథకం ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ రెండో ఏడాది ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ పథకం ప్రారంభించారు. అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కాపుల్లో నిరుపేదల ఉన్న వారికి ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ అందిస్తున్నామని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com