కువైట్ చమురు మంత్రికి భారత పెట్రోలియం మంత్రి ఫోన్

- July 23, 2021 , by Maagulf
కువైట్ చమురు మంత్రికి భారత పెట్రోలియం మంత్రి ఫోన్

కువైట్: భారత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. కువైట్ చమురు మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్ద్ అలేతేఫ్ అల్-ఫారిస్ కి ఫోన్ చేసి చమురు రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. భారత్- కువైట్ మధ్య హైడ్రోకార్బన్స్ రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించే దిశగా పనిచేయడానికి ఇరు పక్షాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత ఇంధన రంగంలో కువైట్ భాగస్వామ్యం కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..కువైట్ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్దు అలేతేఫ్ అల్-ఫారిస్ ను భారత పర్యటనకు రావాల్సిందిగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com