కువైట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆమోదం
- July 23, 2021కువైట్ సిటీ: కువైట్లోని ఇండియన్ ఎంబసీ ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. కోవిషీల్డ్ కువైట్లో కూడా ఆమోదం పొందిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రవాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కువైట్ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. అయితే, వాలిడ్ రెసిడెన్సీ పర్మిట్తో పాటు జాబ్ కాంట్రాక్ట్కు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండి, విదేశీయులపై విధించిన బ్యాన్ తొలిగించిన తర్వాత కువైట్ రావొచ్చని స్పష్టం చేసింది.మొదటి డోసు వ్యాక్సిన్ కు సంబంధించిన సర్టిఫికేట్ను అప్లోడ్ చేసిన అధికారిక లింక్ ద్వారానే రెండో డోసుకు సంబంధించిన వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.అలాగే రెండు డోసులకు సంబంధించిన స్కాన్ కాపీలను పీడీఎఫ్ ఫార్మాట్లో(FileSize: 500KB లోపు ఉండాలి) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
https://vaxcert.moh.gov.kw/SPCMS/PH/CVD_19_Vaccine_External_RegistrationModify.aspx లింక్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎంబసీ తెలిపింది. కాగా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ అప్డేట్ చేసేటప్పుడు దానిపై పాస్పోర్టు నెంబర్ వేయడం తప్పనిసరి.దీని కోసం ప్రవాసులు.. మొదట http://cowin.gov.inలో లాగిన్ అయిన తర్వాత రైజ్ ఏ ఇష్యూను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పాస్పోర్ట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనుకు వెళ్లి పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ