కువైట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆమోదం
- July 23, 2021
కువైట్ సిటీ: కువైట్లోని ఇండియన్ ఎంబసీ ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. కోవిషీల్డ్ కువైట్లో కూడా ఆమోదం పొందిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రవాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కువైట్ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. అయితే, వాలిడ్ రెసిడెన్సీ పర్మిట్తో పాటు జాబ్ కాంట్రాక్ట్కు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండి, విదేశీయులపై విధించిన బ్యాన్ తొలిగించిన తర్వాత కువైట్ రావొచ్చని స్పష్టం చేసింది.మొదటి డోసు వ్యాక్సిన్ కు సంబంధించిన సర్టిఫికేట్ను అప్లోడ్ చేసిన అధికారిక లింక్ ద్వారానే రెండో డోసుకు సంబంధించిన వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.అలాగే రెండు డోసులకు సంబంధించిన స్కాన్ కాపీలను పీడీఎఫ్ ఫార్మాట్లో(FileSize: 500KB లోపు ఉండాలి) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
https://vaxcert.moh.gov.kw/SPCMS/PH/CVD_19_Vaccine_External_RegistrationModify.aspx లింక్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎంబసీ తెలిపింది. కాగా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ అప్డేట్ చేసేటప్పుడు దానిపై పాస్పోర్టు నెంబర్ వేయడం తప్పనిసరి.దీని కోసం ప్రవాసులు.. మొదట http://cowin.gov.inలో లాగిన్ అయిన తర్వాత రైజ్ ఏ ఇష్యూను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పాస్పోర్ట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనుకు వెళ్లి పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







