కువైట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆమోదం
- July 23, 2021
కువైట్ సిటీ: కువైట్లోని ఇండియన్ ఎంబసీ ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. కోవిషీల్డ్ కువైట్లో కూడా ఆమోదం పొందిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రవాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కువైట్ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. అయితే, వాలిడ్ రెసిడెన్సీ పర్మిట్తో పాటు జాబ్ కాంట్రాక్ట్కు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండి, విదేశీయులపై విధించిన బ్యాన్ తొలిగించిన తర్వాత కువైట్ రావొచ్చని స్పష్టం చేసింది.మొదటి డోసు వ్యాక్సిన్ కు సంబంధించిన సర్టిఫికేట్ను అప్లోడ్ చేసిన అధికారిక లింక్ ద్వారానే రెండో డోసుకు సంబంధించిన వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.అలాగే రెండు డోసులకు సంబంధించిన స్కాన్ కాపీలను పీడీఎఫ్ ఫార్మాట్లో(FileSize: 500KB లోపు ఉండాలి) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
https://vaxcert.moh.gov.kw/SPCMS/PH/CVD_19_Vaccine_External_RegistrationModify.aspx లింక్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎంబసీ తెలిపింది. కాగా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ అప్డేట్ చేసేటప్పుడు దానిపై పాస్పోర్టు నెంబర్ వేయడం తప్పనిసరి.దీని కోసం ప్రవాసులు.. మొదట http://cowin.gov.inలో లాగిన్ అయిన తర్వాత రైజ్ ఏ ఇష్యూను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పాస్పోర్ట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనుకు వెళ్లి పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









