రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ

- December 15, 2025 , by Maagulf
రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ

హైదరాబాద్: హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు.ఈ సాయంత్రం రవీంద్రభారతిలో 50 మందితో సంగీత విభావరి ఏర్పాటు చేశారు.ఈ సంగీత కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. బాలు  స్వరాలు మరోసారి రవీంద్రభారతి వేదికపై మార్మోగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com