భారత్ కు సంఘీభావం ప్రకటించిన బహ్రెయిన్
- July 24, 2021
మనామా: కుండపోత వర్షాలు భారత్ లోని పలు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. రెండు రోజుల్లోనే 129 మంది మరణించారు. రాయ్ గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 38 మంది మృతి చెందారు.పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంటలు నీటిపాలయ్యాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలుస్తామని ప్రకటించింది బహ్రెయిన్. ఈ మేరకు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. తమకు చిరకాల మిత్ర దేశమైన భారత్ ఈ ప్రకృతి విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కుండపోత వర్షాలు, వరదల జరిగిన నష్టానికి సానుభూతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







