సౌదీలో ఆరుగురు భారతీయులు అరెస్ట్..!
- July 24, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా రాజధాని రియాద్లో అక్రమ డబ్బు బదిలీలు చేస్తున్న ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి చట్ట విరుద్ధంగా డబ్బు బదిలీ చేస్తున్నట్లు సౌదీ పోలీసులు గుర్తించారు. ఓ సౌదీ వ్యక్తికి చెందిన వాణిజ్య బ్యాంక్ ఖాతా ద్వారా ఈ లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.సౌదీ వ్యక్తిని ఈ ముఠా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు చెల్లింపులు చేస్తున్నట్లు నమ్మించి అక్రమ నగదు బదిలీలు చేశారని రియాద్ పోలీస్ అధికారి ఖలీద్ అల్ కరిదిస్ వెల్లడించారు.
ఇలా సుమారు 3.4 మిలియన్ సౌదీ రియాళ్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితులందరూ 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారేనని తెలిపారు.నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని,త్వరలోనే వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు.ఇక మొత్తం 34.8 మిలియన్ల సౌదీ జనాభాలో సుమారు 10.5 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నట్లు సమాచారం.కాగా, గడిచిన కొన్ని నెలలుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై సౌదీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.దీనిలో భాగంగా నివాస, సరిహద్దు వ్యవస్థలను ఉల్లంఘించిన వారి పట్ల సౌదీ అరేబియా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







