భారత్ కు సంఘీభావం ప్రకటించిన బహ్రెయిన్

- July 24, 2021 , by Maagulf
భారత్ కు సంఘీభావం ప్రకటించిన బహ్రెయిన్

మనామా: కుండపోత వర్షాలు భారత్ లోని పలు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. రెండు రోజుల్లోనే 129 మంది మరణించారు. రాయ్ గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 38 మంది మృతి చెందారు.పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంటలు నీటిపాలయ్యాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలుస్తామని ప్రకటించింది బహ్రెయిన్. ఈ మేరకు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. తమకు చిరకాల మిత్ర దేశమైన భారత్ ఈ ప్రకృతి విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కుండపోత వర్షాలు, వరదల జరిగిన నష్టానికి సానుభూతి వ్యక్తం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com