పాస్పోర్ట్ సర్వీసు ఇప్పుడు మరింత సులభం
- July 25, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో పోస్టాఫీసులు ఇస్మార్ట్ గా మారుతున్నాయి.ఇందుకోసం ఒక్కోసేవను పెంచుకుంటూపోతూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నాయి.ఈ మధ్యనే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టగా.. దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను ప్రారంభించింది.అంతేకాదు,ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది.

కాగా, ఇక ఇప్పుడు పాస్పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తులను కూడా ఇండియా పోస్ట్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది. ఇకపై, దేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో కూడా పాస్పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్(CSC) కౌంటర్లను సందర్శిస్తే చాలు.
పాస్పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాలను ప్రారంభించిన సంగతి ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. ‘ఇప్పుడు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ఎస్ కౌంటర్ వద్ద పాస్పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడం సులభం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సమీప పోస్టాఫీసును సందర్శించండి’ అని ట్వీట్ లో పేర్కొంది. దీని ద్వారా పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రింట్ రసీదు, ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్పోర్టు సేవా కేంద్రాలతో పాటు పాస్పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసులో కూడా సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







