లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీకి అరుదైన గౌరవం
- July 26, 2021అబుధాబి: యూఏఈలో భారత్కు చెందిన వ్యాపార వేత్తకు అరుదైన గౌరవం దక్కింది.గల్ఫ్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ..అబుధాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వైస్ ఛైర్మన్గా నియామకం అయ్యారు.అబుధాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ADCCI)కి నూతన డైరెక్టర్లతో బోర్డును ఏర్పాటు చేయాలని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ తాజాగా తీర్మానించారు.ఈ క్రమంలోనే 29 మంది బోర్డు సభ్యులు ఉన్న ఏడీసీసీఐకి ఇండియాకు చెందిన యూసుఫ్ అలీ వైస్ చైర్మన్గా నియామకం అయ్యారు.ఈ నేపథ్యంలో లులూ సంస్థల ఛైర్మన్ యూసుఫ్ అలీ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.అంతేకాకకుండా యూఏఈ-ఇండియా మధ్య ఉన్న వాణిజ్య బంధాల మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం