APNRTS ఖతార్ వారి సహకారంతో స్వస్థలం చేరిన ప్రవాసాంధ్ర మహిళలు
- July 26, 2021
కడప: APNRTS డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ తెలిపిన వివరాల ప్రకారం 2020 సంవత్సరంలో వై.యస్.ఆర్.జిల్లా అక్కయ్యపల్లికి చెందిన కాకిరేని గంగాదేవి,ఈస్ట్ గోదావరి జిల్లా కోటనండూరు మండలానికి చెందిన గంగాభవాని స్పాన్సర్ ద్వారా గృహ కార్మికులుగా (ఇంటిపని) ఖతార్ కు వెళ్ళారు.
అయితే కొన్ని నెలల తర్వాత స్పాన్సర్ ఇబ్బందులు భరించలేక ఇండియాకి పంపమని 5 నెలల నుండి అడుగుతుంటే వారి ఇద్దరిని ఇండియాకు పంపుతాను అని చెప్పి వారిపై దొంగతనం కేసు మోపి జైలుకు పంపడం జరిగింది.ఈ విషయం APNRTS కో-ఆర్డినేటర్ మరియు ఖతార్ తెలుగు కళా సమితి జాయింట్ జనరల్ సెక్రటరీ మనీష్ కి దృష్టికి వచ్చింది.వెంటనే స్పందించిన మనీష్ ఖతార్ జ్యూడిషియల్ లో స్పాన్సర్ కావాలనే గంగాదేవి మరియు గంగాభవానిలపై అన్యాయంగా దొంగతనం కేసు పెట్టాడని,వారిని ఇండియాకు పంపాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.దీంతో ఖతార్ జ్యూడిషియల్ వారు ఆ అభాగ్యులు ఇద్దరినీ విచారించి,నిర్దోషులుగా గుర్తించి స్వదేశానికి పంపమని ప్రభుత్వానికి తెలియజేశారు.
వెంటనే మనీష్ ICBF MC సభ్యురాలు మరియు ఖతార్ APNRTS కో-ఆర్డినేటర్ రజనీ మూర్తి సహకారంతో ఇండియన్ ఎంబసీ వారితో మాట్లాడి వారికి తాత్కాలిక పాస్పోర్ట్ మరియు టికెట్ ఇప్పించడము జరిగింది.అంతేకాకుండా హైదరాబాద్ విమానాశ్రయము నుండి వారి స్వస్థలాలకు వెళ్ళేందుకు దారి ఖర్చులకు ఖతార్ తెలుగు కళా సమితి సోషల్ సెక్రెటరీ శ్రీమతి దుర్గాభవాని ఆర్ధిక సహాయం అందించటం జరిగింది.బాధితులు కాకిరేని గంగాదేవి, గంగాభవాని 24 జులై 2021 న ఖతార్ లో బయలుదేరి 25 జులై 2021 న హైదరాబాద్ చేరుకోవడం జరిగింది.
ఈ సందర్భముగా APNRTS డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల కోసం పనిచేస్తోందని అన్నారు.వివిధ దేశాలలో APNRTS కో-ఆర్డినేటర్స్ ను నియమించామని,ప్రవాసాంధ్రుల సమస్యలు పరిష్కరించేందుకు APNRTS మరియు కో-ఆర్దినేటర్స్ నెట్ వర్క్ అనునిత్యం పనిచేస్తుందని తెలిపారు.ప్రవాసాంధ్రులకు ఎటువంటి సమస్యలు ఉన్న APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్స్ 8500027678,08632340678 సంప్రదించవచ్చన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మరియు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తరపున మనీష్ మరియు రజని మూర్తి ను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.
కాకిరేని గంగాదేవి, గంగాభవాని మాట్లాడుతూ...APNRTS ద్వారా మాలాంటి బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రికి, APNRTS అధ్యక్షులకు, మమ్మల్ని ఖతార్ లో ఆదుకున్న మనీష్,రజనీ,దుర్గాభవాని కి కృతజ్ఞతలు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







