ఏపీ కరోనా అప్డేట్

- July 26, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.అయితే, టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గిందనే చెప్పాలి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,672 శాంపిల్స్‌ పరీక్షిచంగా…1,627 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 17 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మృతి చెందారు.మరోవైపు ఇదే సమయంలో 2,017 మందికి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం..

ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,41,92,633కి చేరగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,56,392కు పెరిగింది.మరోవైపు.. రికవరీ కేసులు 19,21,371కు చేరుకున్నాయి.కరోనా బారినపడి మృతి చెందినవారు 13,273గా ఉండగా… ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 21,748గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com