రాత్రి 8 గంటల తర్వాత కూడా దుకాణాలకు గ్రీన్ సిగ్నల్
- July 27, 2021
కువైట్: కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల్లో పలు సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. రాత్రి ఎనిమిది తర్వాత దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రతి వారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిమండలి అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో దుకాణాల నిర్వహణ, ఇతర వాణిజ్య లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అయితే..జనం గ్యాదర్ అయ్యే ఎలాంటి కార్యక్రమాలను అనుమతించటం లేదని వెల్లడించారు. పెళ్లిళ్లు, కాన్ఫరెన్స్, సభలు, పిల్లలతో నిర్వహించే ఈవెంట్లపై సెప్టెంబర్ వరకు ఆంక్షలు కంటిన్యూ అవుతాయి. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్నవారికి దేశవ్యాప్తంగా అనుమతితో నిర్వహించే అన్ని ఈవెంట్లకు ఎంట్రీ ఉంటుందని, అదే వ్యాక్సిన్ తీసుకోని వారికి ఫార్మసీలు, కోపరేటీవ్ సొసైటీలు, మార్కెట్లు, ఫుడ్&క్యాటరింగ్ కేంద్రాల్లోకి మాత్రమే అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







