రాత్రి 8 గంటల తర్వాత కూడా దుకాణాలకు గ్రీన్ సిగ్నల్
- July 27, 2021కువైట్: కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల్లో పలు సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. రాత్రి ఎనిమిది తర్వాత దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రతి వారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిమండలి అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో దుకాణాల నిర్వహణ, ఇతర వాణిజ్య లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అయితే..జనం గ్యాదర్ అయ్యే ఎలాంటి కార్యక్రమాలను అనుమతించటం లేదని వెల్లడించారు. పెళ్లిళ్లు, కాన్ఫరెన్స్, సభలు, పిల్లలతో నిర్వహించే ఈవెంట్లపై సెప్టెంబర్ వరకు ఆంక్షలు కంటిన్యూ అవుతాయి. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్నవారికి దేశవ్యాప్తంగా అనుమతితో నిర్వహించే అన్ని ఈవెంట్లకు ఎంట్రీ ఉంటుందని, అదే వ్యాక్సిన్ తీసుకోని వారికి ఫార్మసీలు, కోపరేటీవ్ సొసైటీలు, మార్కెట్లు, ఫుడ్&క్యాటరింగ్ కేంద్రాల్లోకి మాత్రమే అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు