రాత్రి 8 గంటల తర్వాత కూడా దుకాణాలకు గ్రీన్ సిగ్నల్
- July 27, 2021కువైట్: కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల్లో పలు సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. రాత్రి ఎనిమిది తర్వాత దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రతి వారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిమండలి అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో దుకాణాల నిర్వహణ, ఇతర వాణిజ్య లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అయితే..జనం గ్యాదర్ అయ్యే ఎలాంటి కార్యక్రమాలను అనుమతించటం లేదని వెల్లడించారు. పెళ్లిళ్లు, కాన్ఫరెన్స్, సభలు, పిల్లలతో నిర్వహించే ఈవెంట్లపై సెప్టెంబర్ వరకు ఆంక్షలు కంటిన్యూ అవుతాయి. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్నవారికి దేశవ్యాప్తంగా అనుమతితో నిర్వహించే అన్ని ఈవెంట్లకు ఎంట్రీ ఉంటుందని, అదే వ్యాక్సిన్ తీసుకోని వారికి ఫార్మసీలు, కోపరేటీవ్ సొసైటీలు, మార్కెట్లు, ఫుడ్&క్యాటరింగ్ కేంద్రాల్లోకి మాత్రమే అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన