రేపు సుప్రీం కమిటీ భేటీ..కోవిడ్ ఆంక్షలపై సమీక్ష
- July 28, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ నేడు సమావేశం కానుంది. ప్రస్తుతం సుల్తానేట్లో వైరస్ తీవ్రత, అవలంభించాల్సిన విధాన నిర్ణయాలు, అమలులో ఉన్న ఆంక్షల కొనసాగింపు, సడలింపులపై కమిటీ సమీక్షించనుంది. దేశంలో ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులు, జనజీవనంలో మార్పులపై తమకు స్పష్టత ఉందని..అయితే వైరస్ తీవ్రతను అనుసరించే తమ నిర్ణయాల పరిమితి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది అన్నారు. గ్యాదరింగ్ వల్లే వైరస్ తీవ్రత పెరుగుతున్న విషయం ఇప్పటికే అందరి అవగాహనకు వచ్చిందని, వైరస్ కట్టడికి తగినంత ఔషధ ఉత్పత్తి కష్టతరమే కాబట్టి నివారణ మార్గాల వైపే మొగ్గు చూపనున్నట్లు సంకేతం ఇచ్చారు. ఇక ఒమన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగింపు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించే ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమలులో ఉందని, అయితే..వైరస్ తీవ్రత తగ్గిన పలు దేశాలను నిషేధ జాబితాలో నుంచి తొలిగించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తాజా వార్తలు
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!









