రేపు సుప్రీం కమిటీ భేటీ..కోవిడ్ ఆంక్షలపై సమీక్ష
- July 28, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ నేడు సమావేశం కానుంది. ప్రస్తుతం సుల్తానేట్లో వైరస్ తీవ్రత, అవలంభించాల్సిన విధాన నిర్ణయాలు, అమలులో ఉన్న ఆంక్షల కొనసాగింపు, సడలింపులపై కమిటీ సమీక్షించనుంది. దేశంలో ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులు, జనజీవనంలో మార్పులపై తమకు స్పష్టత ఉందని..అయితే వైరస్ తీవ్రతను అనుసరించే తమ నిర్ణయాల పరిమితి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది అన్నారు. గ్యాదరింగ్ వల్లే వైరస్ తీవ్రత పెరుగుతున్న విషయం ఇప్పటికే అందరి అవగాహనకు వచ్చిందని, వైరస్ కట్టడికి తగినంత ఔషధ ఉత్పత్తి కష్టతరమే కాబట్టి నివారణ మార్గాల వైపే మొగ్గు చూపనున్నట్లు సంకేతం ఇచ్చారు. ఇక ఒమన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగింపు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించే ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమలులో ఉందని, అయితే..వైరస్ తీవ్రత తగ్గిన పలు దేశాలను నిషేధ జాబితాలో నుంచి తొలిగించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









