యూఏఈ: 9 మందికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా
- July 28, 2021యూఏఈ: బోగస్ క్రిప్టోకరెన్సీ నేరానికి పాల్పడ్డ 9 మంది సభ్యుల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థనం. ఒక్కో నిందితుడికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా కూడా విధించింది. 18 మిలియన్ దిర్హాములను బోగస్ క్రిప్టో కరెన్సీ ట్రేడ్ ద్వారా నిందితులు సమకూర్చుకున్నారని అభియోగాలు మోపబడ్డాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులు మనీ లాండరింగ్కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. మంచి ఇన్వెస్టిమెంట్ విధానంగా, ఎలాంటి వివాదాల్లేని వ్యవహారంగా నమ్మించి, బాధితుల నుంచి నిందితులు డబ్బుని వసూలు చేశారు. వారిని నమ్మి, బాధితులు పెద్దమొత్తంలో డబ్బుని నిందితుల ఖాతాల్లోకి పంపించారు. కాగా, నిందితుల్ని శిక్షా కాలం పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం