యూఏఈ: 9 మందికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా
- July 28, 2021
యూఏఈ: బోగస్ క్రిప్టోకరెన్సీ నేరానికి పాల్పడ్డ 9 మంది సభ్యుల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థనం. ఒక్కో నిందితుడికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా కూడా విధించింది. 18 మిలియన్ దిర్హాములను బోగస్ క్రిప్టో కరెన్సీ ట్రేడ్ ద్వారా నిందితులు సమకూర్చుకున్నారని అభియోగాలు మోపబడ్డాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులు మనీ లాండరింగ్కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. మంచి ఇన్వెస్టిమెంట్ విధానంగా, ఎలాంటి వివాదాల్లేని వ్యవహారంగా నమ్మించి, బాధితుల నుంచి నిందితులు డబ్బుని వసూలు చేశారు. వారిని నమ్మి, బాధితులు పెద్దమొత్తంలో డబ్బుని నిందితుల ఖాతాల్లోకి పంపించారు. కాగా, నిందితుల్ని శిక్షా కాలం పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా









