యూఏఈ: 9 మందికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా
- July 28, 2021
యూఏఈ: బోగస్ క్రిప్టోకరెన్సీ నేరానికి పాల్పడ్డ 9 మంది సభ్యుల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థనం. ఒక్కో నిందితుడికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా కూడా విధించింది. 18 మిలియన్ దిర్హాములను బోగస్ క్రిప్టో కరెన్సీ ట్రేడ్ ద్వారా నిందితులు సమకూర్చుకున్నారని అభియోగాలు మోపబడ్డాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులు మనీ లాండరింగ్కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. మంచి ఇన్వెస్టిమెంట్ విధానంగా, ఎలాంటి వివాదాల్లేని వ్యవహారంగా నమ్మించి, బాధితుల నుంచి నిందితులు డబ్బుని వసూలు చేశారు. వారిని నమ్మి, బాధితులు పెద్దమొత్తంలో డబ్బుని నిందితుల ఖాతాల్లోకి పంపించారు. కాగా, నిందితుల్ని శిక్షా కాలం పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









