ఎన్‌ఇపి - 2020 తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్

- July 29, 2021 , by Maagulf
ఎన్‌ఇపి - 2020 తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ విద్యా విధానం 2020  తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ పాల్గొన్నారు.హరిచందన్ గురువారం విజయవాడ రాజ్ భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో కార్యక్రమంలో  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర విద్యా మంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ...దేశంలో నూతన విద్యా విధానం 2020 అమలు 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా మారిందని అన్నారు. దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో మరియు నూతన భారతదేశాన్ని నిర్మించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. కొత్త విద్యా విధానం ఆధునికత, భవిష్యత్తు ధోరణులకు సిద్ధంగా ఉన్నందున రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతుందని, ఇది దేశ విద్యా చరిత్రలో ఒక పెద్ద మలుపు అని ప్రధాని అన్నారు. కొత్త విద్యా విధానం వల్ల యువతకు మంచి ఆదరణ లభించిందని, వారు మార్పును అనుసరించడానికి ఆసక్తిగా ఉన్నారన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో విద్యార్థులు ఆన్‌లైన్ విద్యను సులభంగా స్వీకరించారని, డిజిటల్ లెర్నింగ్ ప్రాసెస్‌లో భాగమయ్యారని నరేంద్ర మోడీ తెలిపారు. ఎన్‌ఇపి 2020 భవిష్యత్ ఆధారితమైనదని, దేశంలో విద్యలో డిజిటల్ విప్లవం వస్తుందని ప్రధాని చెప్పారు.

విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రరెడ్డి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com