అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
- July 30, 2021న్యూ ఢిల్లీ: భారత్ ను కరోనా మూడో వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. రెండో వేవ్ లో భారీ సంఖ్యలో మరణాలు, కేసులు నమోదైన నేపథ్యంలో మూడో వేవ్ పై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయినా ఇంకా ఆంక్షలు కొనసాగించాల్సిందేనని తాజాగా స్పష్టం చేసింది.ఆగస్టు 31 వరకు తమ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆదేశాలు పంపింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా నిషేధం కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.విదేశీ విమానాలను అనుమతిస్తే అక్కడి వేరియంట్లు దేశంలోకి ప్రవేశిస్తాయని భయపడుతున్న కేంద్రం ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.ఈ సమయంలో దేశంలోకి విమానాలను అనుమతించడం కానీ, విదేశాలకు పంపడం కానీ జరగదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం