అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
- July 30, 2021
న్యూ ఢిల్లీ: భారత్ ను కరోనా మూడో వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. రెండో వేవ్ లో భారీ సంఖ్యలో మరణాలు, కేసులు నమోదైన నేపథ్యంలో మూడో వేవ్ పై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయినా ఇంకా ఆంక్షలు కొనసాగించాల్సిందేనని తాజాగా స్పష్టం చేసింది.ఆగస్టు 31 వరకు తమ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆదేశాలు పంపింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా నిషేధం కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.విదేశీ విమానాలను అనుమతిస్తే అక్కడి వేరియంట్లు దేశంలోకి ప్రవేశిస్తాయని భయపడుతున్న కేంద్రం ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.ఈ సమయంలో దేశంలోకి విమానాలను అనుమతించడం కానీ, విదేశాలకు పంపడం కానీ జరగదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









