అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

- July 30, 2021 , by Maagulf
అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

న్యూ ఢిల్లీ: భారత్ ను కరోనా మూడో వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. రెండో వేవ్ లో భారీ సంఖ్యలో మరణాలు, కేసులు నమోదైన నేపథ్యంలో మూడో వేవ్ పై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయినా ఇంకా ఆంక్షలు కొనసాగించాల్సిందేనని తాజాగా స్పష్టం చేసింది.ఆగస్టు 31 వరకు తమ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆదేశాలు పంపింది.

దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా నిషేధం కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.విదేశీ విమానాలను అనుమతిస్తే అక్కడి వేరియంట్లు దేశంలోకి ప్రవేశిస్తాయని భయపడుతున్న కేంద్రం ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.ఈ సమయంలో దేశంలోకి విమానాలను అనుమతించడం కానీ, విదేశాలకు పంపడం కానీ జరగదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com