ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో భారత మహిళల హాకీ జట్టు

- August 02, 2021 , by Maagulf
ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో భారత మహిళల హాకీ జట్టు

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 11వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది.మహిళల 200 మీటర్ల హీట్‌లో పరాజయాన్ని చవి చూసినప్పటికీ.. దాన్ని మరిచిపోయేలా చేసింది భారత మహిళల హాకీ జట్టు. పురుషుల జట్టుతో సమానంగా పోరాడింది.క్వార్టర్ ఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది.సెమీ ఫైనల్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టింది.

రాణి రాంపాల్ టీమ్. ఇంకొక్క విజయం చాలు..ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని ముద్దాడటానికి. చివరి వరకు ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిందీ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో భారత్ విజయ దుందుభి మోగించింది.ఇందులో మూడో క్వార్టర్‌లో భారత్ గోల్ సాధించింది. 22వ నిమిషంలో గుర్జీత్ కౌర్ గోల్ సాధించారు.పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో ఆమె సక్సెస్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com