రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ కు విపక్షాల సైకిల్ ర్యాలీ
- August 03, 2021
న్యూ ఢిల్లీ: రాహుల్ గాంధీ సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు. ప్రతిపక్షాల సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించిన రాహుల్ గాంధీ…“ఆప్”, బి.ఎస్.పి లు మినహాయించి మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు. “పెగసస్” సాఫ్టువేర్ను మోడి ప్రభుత్వం కొన్నదా…!? దేశంలో ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రముఖులకు వ్యతిరేకంగా “పెగసస్” ను ప్రయోగించారా..!?, అని మాత్రమే అడుగుతున్నామని సమావేశంలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా పార్లమెంట్ కు సైకిళ్ళ పై రావాలనే యోచనలు చేసాయి ప్రతిపక్షాలు.
నిన్ మధ్యాహ్నం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడుగా ఉన్న మల్లికార్జున ఖార్గే కు ఫోన్ చేసి సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన రక్షణ మంత్రి రాజనాధ్… పార్లమెంట్ లో చర్చలకు ప్రభుత్వం అంగీకరించాలని స్పష్టం చేసారు. “పెగసస్” కుంభకోణం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, అదుపులో లేని పెట్రోధరలు, దేశంలో “కోవిడ్-19” నిర్వహణ లాంటి అంశాలపై చర్చకు పట్టువడుతున్నాయి ప్రతిపక్షాలు. “పెగసస్” కుంభకోణం పై దర్యాప్తు జరపాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేసారు. అయితే పెగసస్” కుంభకోణం పై దర్యాప్తు ను డిమాండ్ చేసిన మొట్టమొదటి బిజేపి భాగస్వామ్యపక్షం జేడియు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు
- పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు..
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత







