సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..
- August 03, 2021
న్యూ ఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్ష ఫలితాలు మంగళవారం 12 గంటలకు విడుదలయ్యాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే వాస్తవానికి పదో తరగతి ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉండగా, పాఠశాలల నుంచి మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం కావడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది. తాజాగా ఈ ఫలితాలను బోర్డు విడుదల చేసింది.
ఫలితాలు చెక్ చేసుకోండిలా..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఫలితాలు అధికారి వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. ఫలితాల కోసం http://cbseresults.nic.in లో చూసుకోవచ్చు.అలాగే http://cbse.gov.in, http://cbse.nic.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.ఫలితాల మార్క్ షిట్లు, సర్టిఫికేట్లను యాక్సెస్ చేసుకోవచ్చు.మూల్యాంకన ప్రకారం.. ఇంటర్నల్ అసెస్మెంట్లు, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









