ఆ వ్యాక్సిన్ ఇప్పుడే వద్దు:WHO
- August 05, 2021
జెనీవా: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.ప్రపంచంలోని అనేక దేశాల్లో డెల్టా వేరియంట్లో వ్యాపిస్తున్నాయి.130కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తోంది.భారత్లో సెకండ్ వేవ్ కు ఈ వేరియంటే కారణం.దీని వలన దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.భారత్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటుగా కొన్ని పశ్చిమాసియా దేశాల్లో బూస్టర్ డోస్ కింద మూడో డోస్ను ప్రజలకు అందించడం మొదలుపెట్టారు.అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్ ను ఇవ్వడంపై ప్రణాళికలు వేస్తున్నారు.ప్రపంచంలో కనీసం 10శాతం మందికి రెండు డోసులు వేసేలా ముందు చర్యలు తీసుకోవాలని ఆ తరువాత మూడో డోస్ గురించి ఆలోచించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కోరారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంకా మొదటి డోస్ పూర్తి కాలేదని, అనేక దేశాల్లో వ్యాక్సిన్ కొరతలు ఉన్నాయని, ఆయా దేశాలకు వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు. కనీసం సెప్టెంబర్ వరకు బూస్టర్ డోస్ ఆలోచనను మానుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









