తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- August 05, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత తగ్గింది.మరోసారి 600కు దిగువగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం..గత 24 గంటల్లో 582 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.ఇక, ఒకేరోజు 638 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,47,811కు చేరుకోగా…రికవరీ కేసుల సంఖ్య 6,35,250కు పెరిగింది.మరోవైపు.. ఇప్పటి వరకు 3,817 మంది కోవిడ్‌ బాధితులు రాష్ట్రంలో మృతిచెందారు.రికవరీ రేటు రాష్ట్రంలో 98.06 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 8,744 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,329 శాంపిల్స్‌ను పరీక్షించారు అధికారులు. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 83, కరీంనగర్‌లో 61, వరంగల్‌ అర్బన్‌లో 61 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com