తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 05, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది.మరోసారి 600కు దిగువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 582 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.ఇక, ఒకేరోజు 638 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,811కు చేరుకోగా…రికవరీ కేసుల సంఖ్య 6,35,250కు పెరిగింది.మరోవైపు.. ఇప్పటి వరకు 3,817 మంది కోవిడ్ బాధితులు రాష్ట్రంలో మృతిచెందారు.రికవరీ రేటు రాష్ట్రంలో 98.06 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 8,744 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,329 శాంపిల్స్ను పరీక్షించారు అధికారులు. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లో 83, కరీంనగర్లో 61, వరంగల్ అర్బన్లో 61 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







