ప్రయాణాలకు వ్యాక్సిన్ లింక్ పై కేబినెట్ కీలక నిర్ణయాలు

- August 06, 2021 , by Maagulf
ప్రయాణాలకు వ్యాక్సిన్ లింక్ పై కేబినెట్ కీలక నిర్ణయాలు

కువైట్: అంతర్జాతీయ ప్రయాణాలకు, సరిహద్దులు దాటి దేశంలోకి వచ్చే ప్రయాణికుల ఎంట్రీకి సంబంధించి వ్యాక్సిన్ నిబంధనలపై కువైట్ మంత్రి మండలి చర్చించింది.షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా అధ్వర్యంలో సమావేశమైన మంత్రిమండలి..ప్రయాణాలకు వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధన నుంచి ఏయే కేటగిరి వారికి మినహాయింపు ఇవ్వాలనే దానిపై పలు నిర్ణయాలు తీసుకుంది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ చేసిన పలు సిఫార్సులను ఈ సమావేశంలో మంత్రిమండలి సమీక్షించింది. వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొనబడని వయసు వారికి వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు కేబినెట్ వెల్లడించింది.అలాగే ఆరోగ్య కారణాల రిత్యా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులైన వారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి సర్టిఫికెట్ పొందిన పౌరులకు మాత్రమే వ్యాక్సిన్ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.మిగిలిన కేటగిరి పౌరులు అందరికీ వ్యాక్సిన్ డోసులు పూర్తైన తర్వాతే అంతర్జాతీయ ప్రయాణాలకు, దేశంలోకి రీఎంట్రీకి అనుమతించనున్నట్లు మంత్రిమండలి స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి మంత్రిమండలి నిర్ణయాలు అమలులోకి రానున్నాయి. ఇదిలాఉంటే దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న కువైట్..ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను కూడా తిరిగి సాధారణ స్థితిలో కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఆగస్ట్ 15 నాటికి అన్ని ప్రభుత్వ సంస్థలలో వర్క్ సిస్టమ్ సాధారణంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com