జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కు కేంద్రం ఆమోదం
- August 07, 2021
న్యూఢిల్లీ: కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అత్యవసర వినియోగానికి మరో వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్కు ఆమోదం తెలిపింది. ఇది సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ' భారత్ తన వ్యాక్సిన్ బాస్కెట్ను విస్తరిస్తోంది. భారత్లో అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు కోవిడ్-19 టీకా ఆమోదించాం. ప్రస్తుతం దేశంలో దేశంలో ఐదు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి ఆమోదించాం. కరోనాపై పోరు సాగిస్తున్న భారత్కు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది' అని ట్వీట్ చేశారు. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న రెండు రోజులకు జాన్సన్ అండ్ జాన్సన్కు ఆమోదం లభించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







