భారత్ కరోనా అప్డేట్

- August 08, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసుల ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.తాజాగా భారత్‌లో 39,070 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది.ఇందులో 3,10,99,771 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  4,06,822 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి.దేశంలో కొత్త‌గా క‌రోనాతో 491 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య 4,27,862కి చేరింది.ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనా నుంచి 43,910 మంది కోలుకున్నారు. 24 గంట‌ల్లో భారత్‌లో 55,91,657 మందికి టీకాలు అందించారు.ఇప్ప‌టి వ‌ర‌కు భారత్‌లో మొత్తం 50,68,10,492 మందికి టీకాలు అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com