నేటి నుంచి విదేశీయుల నుంచి ఉమ్రా వినతులు..

- August 09, 2021 , by Maagulf
నేటి నుంచి విదేశీయుల నుంచి ఉమ్రా వినతులు..

సౌదీ: ఆగస్టు 9 నుండి విదేయుల నుండి ఉమ్రా అభ్యర్థనలను స్వీకరించడం ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియా హజ్ & ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు..పవిత్ర ప్రార్ధనా ప్రాంగణంలోకి అనుమతించే భక్తుల పరిమితిని కూడా క్రమంగా పెంచుతూ వస్తోంది. ఇక నుంచి నెలకు 2 మిలియన్ల మంది యాత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. అయితే..విదేశీయులకు ఈత్మార్న& తవక్కల్నా యాప్‌ల ద్వారా మాత్రమే అనుమతులు జారీ చేయబడతాయి. ఉమ్రా కోసం రిక్వెస్ట్ చేసుకునే విదేశీ భక్తులకు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండిఉండాలి. అలాగే సౌదీ ప్రభుత్వం ఆమోదించిన ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ & జాన్సన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com