దుబాయి ఎన్నారై మహిళకు 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డు
- March 12, 2016
దుబాయిలోని ప్రవాస భారతీయ సామాజిక సేవకురాలు శ్రీమతి అరవపల్లి వసుధ గుప్త 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డుకు ఎంపికయ్యారు.
ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (అవోపా), హైదరాబాద్ శాఖ వారు వివిధరంగాల్లో విశేష సేవలందించిన మహిళలను 'ప్రసిద్ధ ఆర్య వైశ్య మహిళ' అవార్డులకు ఎంపికచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఆదివారం 13 మార్చి 2016 న ఉ.10 గం. లకు హైదరాబాద్ లోని కాచిగూడ వైశ్య హాస్టల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు.
దుబాయిలోని వాసవి యూత్ ఎన్నారై అసోసియేషన్ లో వసుధ గుప్త చురుకైన సభ్యురాలు. గత 10 ఏళ్లుగా ఆమె దుబాయిలో నివసిస్తున్నారు. భారతీయ సంస్కృతి గురించి ఆమె 'ప్రజ్ఞ' అనే తరగతులను నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రవాసులకు ఆమె సహాయం చేస్తుంటారు.
దుబాయ్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు సహాయం, సలహాల కోసం వసుధ గుప్త వాట్సప్ నెంబర్: +97150 9582549 ఇ-మెయిల్: [email protected] కు సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







