ఆఫ్ఘన్లోని భారతీయులకు ప్రత్యేక విమానం

- August 10, 2021 , by Maagulf
ఆఫ్ఘన్లోని భారతీయులకు ప్రత్యేక విమానం

ఆప్ఘనిస్థాన్‌: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు పలు ప్రాంతాలను వారి ఆధీనంలోకి తీసుకుంటుండడంతో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అక్కడికి ప్రత్యేక విమానం పంపించింది. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది. మజారె షరీఫ్ చుట్టుపక్కల ఉన్న భారతీయులంతా ఈ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చేయాలని అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ ఫ్లైట్‌కు వచ్చే వాళ్లు వెంటనే పూర్తి పేరు, పాస్‌పోర్ట్ వివరాలు పంపించాలని వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com