అంతర్జాతీయ ప్రయాణ చార్జీలపై క్లారిటీ ఇచ్చిన డీజీసీఏ

- August 11, 2021 , by Maagulf
అంతర్జాతీయ ప్రయాణ చార్జీలపై క్లారిటీ ఇచ్చిన డీజీసీఏ

న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు విమాన చార్జీలను ఆయా ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్స్‌లోనే చూసుకోవాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) సూచించింది. గూగుల్‌, యాహూ, స్కైస్కానర్‌ వంటి మెటా సెర్చింజన్లలో చార్జీలను పరిశీలించవద్దని కోరింది. సెర్చింజన్లలో అసలైన ధరలు ఉండకపోవచ్చని, అధిక చార్జీలను సూచించే అవకాశాలున్నాయని పేర్కొంది. బ్రిటన్‌లో కళాశాలల అడ్మిషన్‌ సీజన్‌ కావడంతో.. లండన్‌ వెళ్లే విమానాల్లో చార్జీలు అమాంతం పెరిగిపోయాయనే ఫిర్యాదుల నేపథ్యంలో డీజీసీఏ మంగళవారం ఈ మేరకు స్పందించింది. ఏదేమైనా, UK తో సహా 28 దేశాలతో ఏర్పడిన బయో బబుల్ ఏర్పాట్ల కింద జూలై 2020 నుండి పరిమిత ప్రత్యేక అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు నడుస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com