సౌదీపై హౌతీ మిలిషియా దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్
- August 14, 2021బహ్రెయిన్: ఉగ్రవాద సంస్థ హౌతీ మిలిషియా సౌదీపై చేసిన దాడి యత్నంపై బహ్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీలోని ఖమీస్ ముషైత్ లక్ష్యంగా హౌతీ మిలిషీయా బాంబులతో కూడిన డ్రోన్ను ప్రయోగించటాన్ని ఖండించింది. నిరంతర దాడులు ప్రజల భద్రతకు భంగం కలిగించటంతో పాటు సౌదీ అరేబియా భద్రత, స్థిరత్వాన్ని సవాల్ చేయాలన్నది హౌతీ మిలిషియా ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం అవుతోందని అభిప్రాయపడింది. అయితే..హౌతీ మిలిషియా ప్రయోగించిన డ్రోన్ను భద్రతా దళాలు అడ్డగించి విధ్వంసం చేయాటాన్ని ప్రశంసించింది.ఇది యెమోన్ చట్టబద్ధత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడిన సంకీర్ణ దళాల అప్రమత్తకు నిదర్శమని పేర్కొంది. ఏదిఏమైనా తమ రక్షణకు స్థిరత్వాన్ని చాటుకునేందుకు సౌదీ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని బహ్రెయిన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత