కాబుల్: ఆర్మీ కాల్పులు… ఎయిర్పోర్ట్లో హైటెన్షన్
- August 16, 2021
కాబుల్: తాలిబన్లు కాబూల్లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి.తమ ఉద్యోగులు,సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు.ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్పోర్టులో ఉన్నాయి.అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియక భయపడుతున్నారు.పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఏయిర్పోర్టుకు చేరుకోవడంతో ఒకదశలో వారికి కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. అందుబాటులో ఉన్న విమానాలను ఎక్కేస్తుండంతో అమెరికన్ సైన్యం అప్రమత్తరం అయింది. సైన్యం కాల్పులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలని చూస్తున్న ప్రజలకు ఎయిర్పోర్ట్లో ఎదురైన సంఘటనలతో మరింత భయాందోళనలు చెందుతున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







