భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- August 17, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.తాజాగా భారత్‌లో25,166 కేసులు న‌మోద‌వ్వ‌గా, 437 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దాదాపు 5 నెల‌ల త‌రువాత 25 వేల కేసులు న‌మోద‌వ్వ‌డం విశేషం.భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా క‌రోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భార‌త్‌లో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 3.14 కోట్ల‌కు చేరింది.ఇక‌పోతే, ఇప్ప‌టి వ‌ర‌కు భారత్‌లో క‌రోనాతో 4,32,079 మంది మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో 88,13,919 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com