బరువు తగ్గిన నివాసితులకు బహుమతులు
- August 18, 2021
అబుధాబి: మహమ్మారి కాలంలో వివిధ పద్ధతుల్లో బరువు తగ్గిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ(DAMAN) సీఈవో హమద్ అల్ మెహియాస్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెహియాస్ పేరుతో ప్రత్యేక హ్యాష్ట్యాగ్ ఛాలెంజ్ చేశారు. కొంత వ్యవధిలో ప్రత్యేక పద్దతులను అనుసరించి, బరువు తగ్గినవారు తాము అనుసరించిన విధానాలను ఈ ఛాలెంజ్లో షేర్ చేయడం ద్వారా ఐఫోన్, యాపిల్ వాచ్ తదితర బహుమతులను అందుకోవచ్చని తెలిపారు. ఈ మహమ్మారి సమయంలో ఆరోగ్యకరమైన అలవాట్లకు ఆంటకాలేర్పడ్దాయి. ఫలితంగా పలువురు బరువు పెరిగారని హమద్ అల్ మెహియాస్ పేర్కొన్నారు. ఇదిలావుండగా మహమ్మారి సమయంలో యూఏకీ చెందిన 31 శాతం మంది బరువు పెరిగారని ఒక అధ్యయనంలో తేలింది. 39 శాతం మంది శారీర వ్యాయామానికి దూరమై పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









