తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటమే... ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- August 18, 2021ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా అఫ్గాన్ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ కి చెందిన ఎంపీ ఒకరు వివాదస్పద వాఖ్యలు చేశారు. తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారయన.. ఆయనే సంభాల్ నియోజకర్గ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ నేత షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్.. ఒకరకంగా వారిది స్వాతంత్య్ర పోరాటమేనని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, అనుకున్నది సాధించారని చెప్పుకొచ్చారు. ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ చేసిన వ్యాఖ్యల పైన ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు.వారిని సమర్దించడం అంటే రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. గతంలో కూడా బర్ఖ్ పలు అంశాల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా బర్ఖ్ ఐదుసార్లు ఎంపీగా మరియు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం