తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటమే... ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- August 18, 2021
ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా అఫ్గాన్ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ కి చెందిన ఎంపీ ఒకరు వివాదస్పద వాఖ్యలు చేశారు. తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారయన.. ఆయనే సంభాల్ నియోజకర్గ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ నేత షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్.. ఒకరకంగా వారిది స్వాతంత్య్ర పోరాటమేనని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, అనుకున్నది సాధించారని చెప్పుకొచ్చారు. ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ చేసిన వ్యాఖ్యల పైన ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు.వారిని సమర్దించడం అంటే రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. గతంలో కూడా బర్ఖ్ పలు అంశాల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా బర్ఖ్ ఐదుసార్లు ఎంపీగా మరియు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







