ఆఫ్గాన్లోని రాయబార కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు
- August 20, 2021
ఆఫ్గానిస్తాన్: ఆఫ్గానిస్తాన్లోని రాయబార కార్యాలయాల్లో ఏమైనా కీలక సమాచారం దొరుకుతుందా అని వెతుకుతున్నాయి తాలిబన్ దళాలు. ఇప్పటికే, భారత్తో పాటు అన్ని దేశాలు తమ సిబ్బందిని తీసుకెళ్లిపోయాయి. ఎంబసీ ఆఫీసులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటిలో ఫైల్స్, కంప్యూటర్స్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. కీలక డాక్యుమెంట్లేవీ దొరక్కపోవడంతో.. కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లిపోయారు తాలిబన్లు. మొదట కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో సోదాలు చేశారు. అక్కడ ఖాళీ కుర్చీలు, బెంచీలు తప్ప ఏం దొరకలేదు. దీంతో జలాలాబాద్, కాబూల్లోని కాన్సులేట్, ఎంబసీల్లోనూ వెతికారు. అక్కడ కూడా కీలక డాక్యుమెంట్లు దొరకలేదు. మొత్తానికి, తాలిబన్లు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అన్ని దేశాల రాయబార కార్యాలయాలను తెరుచుకోవచ్చని.. మొదటి ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు తాలిబన్లు. ప్రపంచ దేశాలతో సఖ్యతగా ఉంటామని, ధైర్యంగా ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చని చెప్పారు. కాని, పరిస్థితి అందుకు రివర్స్లో ఉంది. రాయబార కార్యాలయాల్లో సోదాలు చేయడం, కీలక పత్రాలు ఎత్తుకెళ్లాలని చూడడంతో.. అంతర్జాతీయ సమాజానికి తాలిబన్లు ఎలాంటి వాళ్లో తెలిసొచ్చింది. తాలిబన్ నేతల మాటలు నమ్మడానికి వీల్లేదని ఒక్కో సంఘటన రుజువు చేస్తోంది.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









