ఖచ్చితమైన నిబంధనల నడుమ స్కూళ్ళకు తిరిగి రానున్న విద్యార్థులు

- August 20, 2021 , by Maagulf
ఖచ్చితమైన నిబంధనల నడుమ స్కూళ్ళకు తిరిగి రానున్న విద్యార్థులు

సౌదీ అరేబియా: ఆగస్ట్ 29 నుంచి ప్రారంభమయ్యే స్కూళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. పూర్తిస్థాయిలో కోవిడ్ 19 నిబంధనలు అమలు చేస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ స్కూళ్ళను తెరుస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. 93 శాతం విద్యార్థులు కనీసం ఒక డోసు తీసుకుననారనీ, 37 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 85 కాగా, రెండు డోసులు పూర్తి చేసుకున్నవారి శాతం 59గా వుంది. వ్యాక్సినేషన్ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు ఇంటి వద్దనే వుండి, టీచర్లు మద్రసాటి వేదికపై అప్‌లోడ్ చేసే పాఠాల్ని చదువుకోవాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com