వచ్చే నెల 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
- August 24, 2021
హైదరాబాద్: 17 నెలలుగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా తగ్గుముఖం పట్టడంతో సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభిస్తామన్నారు. 60 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు రాబోతున్నారని తెలిపారు. అంగన్వాడీ సంస్థలు కూడా ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. మిడ్ డే మీల్స్పై కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించామని... అలాగే వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యానికి సూచించినట్లు మంత్రి సబితా తెలిపారు.
విద్యాసంస్థలు తెరవడంపై అన్ని జిల్లాల అధికారులు, రాజకీయ నాయకులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించామని... అందరూ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈనెల 30లోపు స్కూళ్లు సిద్ధం చేయాలని.. లేదంటే చర్యలు తప్పవన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే.. వెంటనే టెస్ట్ చేయాలని మంత్రి ఎర్రబెల్లి... అధికారులకు సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి మాదిరిగా... విద్యాసంస్థలను శానిటైజ్ చేయడం కూడా నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







