తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- August 24, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 389 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 88,347 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. వైరస్‌ బారినపడిన వారిలో 420 మంది కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,862కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,55,732కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,276 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 6,45,594 మంది కోలుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com