ప్రవాసీయులకు అందిస్తున్న పురస్కారాలు
- August 25, 2021
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసానికి పాటుపడుతున్న తెలుగువారిని గౌరవించాలనే ఉద్దేశంతో సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశాయి.తెలుగు భాషా దినోత్సవం రోజున కొందరికి ప్రవాస తెలుగు పురస్కారాల పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ పురస్కారాలకు నామినేషన్లు పంపేందుకు ఆగస్టు 10 ఆఖరు తేదీ కాగా.. పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు నానినేషన్లు పంపారన్నారు. తమకు అందిన నామినేషన్లను నిష్ణాతులైన జ్యూరీ పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎన్నిక చేసిందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విక్రం పెట్లూరు, వెంకట్ తరిగోపుల,లక్ష్మణ్, తొట్టెంపూడి శ్రీ గణేష్ ఈ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు.ఈ పురస్కారాలను ఆగస్టు 28, 29 తేదీల్లో జరగబోయే తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ప్రదానం చేస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









