ప్రవాసీయులకు అందిస్తున్న పురస్కారాలు
- August 25, 2021
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసానికి పాటుపడుతున్న తెలుగువారిని గౌరవించాలనే ఉద్దేశంతో సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశాయి.తెలుగు భాషా దినోత్సవం రోజున కొందరికి ప్రవాస తెలుగు పురస్కారాల పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ పురస్కారాలకు నామినేషన్లు పంపేందుకు ఆగస్టు 10 ఆఖరు తేదీ కాగా.. పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు నానినేషన్లు పంపారన్నారు. తమకు అందిన నామినేషన్లను నిష్ణాతులైన జ్యూరీ పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎన్నిక చేసిందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విక్రం పెట్లూరు, వెంకట్ తరిగోపుల,లక్ష్మణ్, తొట్టెంపూడి శ్రీ గణేష్ ఈ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు.ఈ పురస్కారాలను ఆగస్టు 28, 29 తేదీల్లో జరగబోయే తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ప్రదానం చేస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









