కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు..
- August 26, 2021
కాబూల్: కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. దీనిని ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. బాంబు పేలుడు సంఘటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్పోర్ట్లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు.
ఆఫ్గనిస్థాన్లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. దీనిని ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. ప్రాణనష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు పెంటగాన్ అధికారులు సమాచారమిచ్చారు. కాగా, కాబూల్ విమానాశ్రయం వద్ద దాడులు జరగొచ్చని ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా సైతం ఈ హెచ్చరికలను సమర్థించాయి. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బాంబు పేలుడు సంఘటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.కాబూల్ ఎయిర్పోర్ట్లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. విమానాన్ని సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కాబూల్ నుంచి అధికారులు, జర్నలిస్టులను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









