బహ్రెయిన్లో 57 శాతం మందికి సినోఫామ్ వ్యాక్సిన్
- August 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19పై పోరులో భాగంగా 57 శాతం మంది పౌరులు, నివాసితులు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. మొత్తం 569,054 మంది సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, బహ్రెయిన్లో మొత్తం 996,403 మంది రెండు డోసుల వ్యాక్సిన్లను డిసెంబర్ 9 నుంచి జులై 17 మధ్య తీసుకున్నారు. 19 శాతం జనాభా స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకోగా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 17. మిగతా 7 శాతం మంది ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పొందనివారిలోనే 88 శాతం కోవిడ్ మరణాలు సంభవించాయి. సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 11.4 శాతం మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఫైజర్ మరియు స్పుత్నిక్ వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆరు. ఆస్ట్రా జెనకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయింది ఒకే ఒక్కరు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







