బహ్రెయిన్‌లో 57 శాతం మందికి సినోఫామ్ వ్యాక్సిన్

- August 28, 2021 , by Maagulf
బహ్రెయిన్‌లో 57 శాతం మందికి సినోఫామ్ వ్యాక్సిన్

బహ్రెయిన్: కోవిడ్ 19పై పోరులో భాగంగా 57 శాతం మంది పౌరులు, నివాసితులు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. మొత్తం 569,054 మంది సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, బహ్రెయిన్‌లో మొత్తం 996,403 మంది రెండు డోసుల వ్యాక్సిన్లను డిసెంబర్ 9 నుంచి జులై 17 మధ్య తీసుకున్నారు. 19 శాతం జనాభా స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకోగా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 17. మిగతా 7 శాతం మంది ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పొందనివారిలోనే 88 శాతం కోవిడ్ మరణాలు సంభవించాయి. సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 11.4 శాతం మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఫైజర్ మరియు స్పుత్నిక్ వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆరు. ఆస్ట్రా జెనకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయింది ఒకే ఒక్కరు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com