ద్వైపాక్షిక బంధం బలోపేతంపై మోడీకి అబుధాబి యువరాజు సందేశం
- August 31, 2021భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక బంధం, స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు అబుదాబి యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీకి సందేశాన్ని పంపించారు. అధికార పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ ద్వారా ఈ సందేశాన్ని చేరవేశారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో జరిగిన సమావేశం సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధంపై జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలపై వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు