ద్వైపాక్షిక బంధం బలోపేతంపై మోడీకి అబుధాబి యువరాజు సందేశం
- August 31, 2021
భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక బంధం, స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు అబుదాబి యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీకి సందేశాన్ని పంపించారు. అధికార పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ ద్వారా ఈ సందేశాన్ని చేరవేశారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో జరిగిన సమావేశం సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధంపై జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలపై వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









