ద్వైపాక్షిక బంధం బలోపేతంపై మోడీకి అబుధాబి యువరాజు సందేశం

- August 31, 2021 , by Maagulf
ద్వైపాక్షిక బంధం బలోపేతంపై మోడీకి అబుధాబి యువరాజు సందేశం

భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక బంధం, స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు అబుదాబి యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీకి సందేశాన్ని పంపించారు. అధికార పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ ద్వారా ఈ సందేశాన్ని చేరవేశారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో జరిగిన సమావేశం సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధంపై జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలపై వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com